ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 28సెప్టెంబర్..//..మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష ,జరిమానా విధిస్తూ సివిల్ న్యాయమూర్తి శ్యాం సుందర్ రావు తీర్పునిచ్చారు. పట్టణంలోని వాహనాల తనిఖీలలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ చలి కంటి నరేష్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, 32 వేల రూపాయల జరిమానాను విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ,డిఎస్పి నాగభూషణం ఆదేశాల మేరకు, పట్టణ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రతిరోజు శ్వాస విశ్లేషణ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా నిషేధిత ప్రాంతాలలో వాహనాలను పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
- 5 views