జపాన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్‌లో పర్యటించనుంది. జపాన్‌లోని భారత రాయబారి శింబు జార్జ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని వందేళ్ల నాటి ఇండియా హౌజ్‌లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు.

రేపు టోక్యోలో సోని గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తొషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *