మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి మార్చి-30 (ప్రజా జ్యోతి)
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు సత్యనారాయణ, పద్మ శ్రీకాంత్, పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్,మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా,ముస్లిం పెద్దలు మాజీ జడ్పీటీసీ గాయాజోద్దీన్, హరీఫ్, గఫ్ఫార్, హాజర్, షేకవత్ అలీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగం గోపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.