రామారెడ్డి ముదిరాజ్ నూతన పాలకవర్గం ఎన్నిక

V. Sai Krishna Reddy
1 Min Read

రామారెడ్డి ముదిరాజ్ నూతన పాలకవర్గం ఎన్నిక

— జాతీ జెండా ఆవిష్కరణ
— ఉగాది పచ్చడి వితరణ

రామారెడ్డి మార్చ్ 31 (ప్రజా జ్యోతి)

ముదిరాజ్ సంఘం నూతన పాలకవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా బైండ్ల నర్సింలు, ఉపాధ్యక్షులు మోషంపల్లి రాములు, సెక్రటరీ చాత్రాబోయిన నవీన్, కోశాధికారి చతర బోయిన నర్సింలు, వారి పాలకవర్గం శనివారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడు బైండ్ల నర్సింలు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంఘం యొక్క బలోపేతానికి కృషి చేస్తానని, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండి మా యొక్క పాలకవర్గం సభ్యుల సహకారంతో, ఎల్లవేళలా తమకి ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా సంఘ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా ఉగాది పండుగను పురస్కరించుకొని ముదిరాజ్ జాతి జెండాను ఆవిష్కరించారు. తదుపరి పచ్చడి వితరణ నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో పాలకు వర్గ సభ్యులు, సంఘ సభ్యులు, పాండిలవారీగా అధ్యక్షులు వారి పాలకవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *