విద్యుత్ తీగ తెగిపడి దహనమైన పంట: జెసిబి సహాయంతో తప్పిన పెను ప్రమాదం
నెక్కొండ, ప్రజా జ్యోతి::
11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో జెసిబి అందుబాటులోకి రావడంతో, దాని సహాయంతో ముందస్తుగా అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, కళ్లముందే దహనమైన మిగిలిన పంటను చూసి అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
