వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం

Kamareddy
1 Min Read

వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం

సుమారు రాత్రి 12 గంటల నుండి సమస్య 

సుమారు 12 గంటలు దాటిన సమస్య తీరలే

రామారెడ్డి ఫిబ్రవరి 02 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని పవర్ స్టేషన్ నుండి రామారెడ్డి ఏజిఎల్ ఫీడర్ సింగిల్ లైన్ ప్రాబ్లం వలన అంతరాయం ఏర్పడిందని తద్వారా రాత్రి 12 గంటల నుండి విద్యుత్ సప్లై లేక బోరు మోటర్లు నడవక పంట పొలాలకు నీరు అందక, ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పంట పొలాలు చిరుకోట దశలో నీరు అందక విలవిల పోతున్న కర్షకులు, అసలే వేసవి కాలం నీళ్లతో ఇబ్బందులు ఇలాంటి సమయంలో విద్యుత్ అంతరాయ సమస్యలు బాధపడుతున్న రైతాంగం,

ఇన్చార్జి ఏఈ..!

మండల కేంద్రానికి గత నాలుగు ఐదు నెలలుగా ఏఈ అధికారి లేక ఇన్చార్జి ఏఈ తో సమస్యలను నెట్టుకొస్తున్నారు. అసలే విద్యుత్ అధికారుల లోటు, సరైన సిబ్బంది లేక, సమయానికి పనులు జరగక ఇబ్బందులు పడుతున్న వైనం. 

ఇన్స్పెక్టర్ ఏసురత్నం..!

విద్యుత్ అంతరాయంపై లైనింగ్ ఇన్స్పెక్టర్ ఏసురత్నం ను వివరణ కోరగా సమస్యను వెతుకుతున్నాం సమయం పడుతుంది. సింగిల్ ఫేస్ వస్తుంది. మరో రెండు లైన్లు విద్యుత్తు రావడం లేదు ఎక్కడో ఏదో ఒకచోట సాంకేతిక సమస్య ఉండొచ్చు అని అందువల్ల ఈ యొక్క సమస్య తలెత్తిందని, ఈ సమస్యను తీర్చేందుకు సిబ్బందితో సహా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఏది ఏమైనా ఇకనైనా విద్యుత్ అధికారులు త్వరగా స్పందించి విద్యుత్ సమస్యను తీర్చాల్సిందిగా రైతులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *