అరణ్య దండకంగా గ్రామాలు కామారెడ్డి (ఆర్ సి)బిక్కనూరు,ఫిబ్రవరి 3 (ప్రజాజ్యోతి) భిక్కనూరు
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన లింగంపేట తిరుమల గౌడ్ ను మంగళవారం రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో కోతులు దాడి చేయగా, వాటి దాడి వల్ల తీవ్రంగా గాయపడిన తిరుమల గౌడ్ దోమకొండ ఆసుపత్రికి తరలించగా రక్తస్రావం ఎంతటికి ఆగకపోవడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది ఒక పెద్ద మల్లారెడ్డి గ్రామానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. మండలంలోని అన్ని గ్రామాలలో పిల్లలు,పెద్దలను ప్రతినిత్యం భయపడుతున్న ప్రధాన సమస్యగా మారింది. కోతుల బెడదపై వెంటనే సర్పంచులు స్పందించి తక్షణ పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
