పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక సందడి

V. Sai Krishna Reddy
1 Min Read

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు.

నిన్న‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన జంటను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్, రష్మిక ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ వారిని ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *