ఫెర్టిలైజర్ షాపులు రోజంతా మూసివేత

Kamareddy
1 Min Read

ఫెర్టిలైజర్ షాపులు రోజంతా మూసివేత

— జిల్లాలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, అధికారుల తనిఖీ కారణమా..?

— నికార్సేన మందులు విత్తనాలు అమ్మితే భయం ఎందుకో..?

— కల్తీ నాసిరకం అమ్మకపోతే షాపులు ఎందుకు మూత..?

రామారెడ్డి జూన్ 12 (ప్రజాజ్యోతి)

వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతులంతా తమ సమయానుసారంగా జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపులలో వారికి నచ్చిన పంటలకు సంబంధించిన విత్తనాలను కొనుగోలు చేయడానికి వెళుతుంటారు. అనుకోకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు పలు షాపులలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫర్టిలైజర్ షాపులు కొందరు షాప్ లో తనిఖీ చేయనున్నారు అన్న సమాచారం మేరకు రోజంతా షాపులు మూసి ఉంచడంపై రైతులకు సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నికార్సైన సర్టిఫైడ్ విత్తనాలు అమ్మినప్పుడు ఎందుకు భయపడాలి. ప్రభుత్వానికి టాక్స్ పే చెల్లించడంలో లొసుగులు ఉన్నాయా..? లేదా ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు భయం వలన షాప్ లను మూసి ఉంచారా అని అనుమానాలు కలిగిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *