విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కన్నప్ప’ మూవీ ఫైనల్ కాపీపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని విష్ణు ఇదివరకే మీడియాకు తెలిపారు.
ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్లో మంచు మోహన్ బాబు, విష్ణు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ వద్ద భారీ బౌన్సర్లతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంలో మోహన్ బాబు, విష్ణు సంతృప్తి వ్యక్తం చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది. ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలను వారు వెల్లడిస్తూ వచ్చారు. మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాణ సంస్థ నిర్వహిస్తోంది. త్వరలో ట్రైలర్ విడుదల కార్యక్రమం ఉండనుందని సమాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ప్రభాస్ కూడా వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని భీమవరం గ్రామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. దీంతో వీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు