ఎండల తీవ్రత దృష్ట్యా సాధారణంగా మార్చి 15వ తేదీ నుంచి యేటా విద్యార్ధులకు ఒంటి పూట బడులు ఇస్తుంటారు. కానీ తెలంగాణలో ఈసారి కాస్త ముందుగానే ఒంటి పూట బడులు ఇస్తూ విద్యా సంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. దీంతో విద్యార్థులకు ఒంటిపూట బడులు రేపట్నుంచే అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. రంజాన్ ప్రారంభ నేపథ్యంలో ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడి పిల్లలకు మార్చి 15వ తేదీ నుంచి యేటా ఒంటి పూట బడులు ఇస్తుంటారు. అయితే ఈసారి మాత్రం కాస్తముందుగానే ప్రభుత్వం ఒంటి పూట బడులు ప్రకటించింది. దీంతో మార్చి 3వ తేదీ నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టుగా సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో విద్యార్ధులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పిల్లలకు తరగతులు నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర పాఠశాలలోని ఉర్దూ మీడియం విభాగాలు, DIET కాలేజీల్లోని ఉర్దూ మీడియం విభాగాలకు తాజా ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.