వింత వ్యాధి… సోకిన 48 గంటల్లోపే మరణం కన్ఫాం

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోపక్క అదే స్థాయిలో అన్నట్లుగా కొత్త కొత్త వైరస్ లు, వింత వింత వ్యాధులు ప్రభలుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోపక్క అదే స్థాయిలో అన్నట్లుగా కొత్త కొత్త వైరస్ లు, వింత వింత వ్యాధులు ప్రభలుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి టెన్షన్ పెడుతుంది.. సుమారు ఐదు వారాలుగా ఆ దేశ ప్రజలకు పేరు తెలియని ఈ వ్యాధి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అవును… ఎబోలా, డెంగ్యూ, మార్ బర్గ్, యెల్లో ఫీవర్ లక్షణాలు పోలి ఉన్నట్లు చెబుతున్న ఓ వింత వ్యాధి ఇప్పుడు కాంగో దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వింత వ్యాధి సోకినవారు జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో చనిపోతున్నారు. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది

కొన్ని వారాల క్రితం ఈ దేశంలోని బొలొకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలాలను తిన్నారని.. అలా తిన్న 48 గంటల్లో ఆ ముగ్గురు పిల్లలు మరణించారని అంటున్నారు. దీంతో… ఈ వ్యాధి గబ్బిలాల ద్వారా సంక్రమిస్తుందా అనే చర్చ మొదలైందని అంటున్నారు. ఈ వ్యాధి ఇప్పటివరకూ 431 మందికి సోకగా.. అందులో 53 మంది ఇప్పటికే మరణించారని చెబుతున్నారు. ఫిబ్రవరి 9న బోమాటే గ్రామంలో ఈ మిస్టరీ వ్యాధి సోకిన 13 కేసుల నుంచి నమూనాలను పరీక్ష కోసం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ కు పంపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అన్ని శాంపిల్స్ రెగ్యులర్ హెమరేజిక్ ఫీవర్ కు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *