- జిల్లా సంక్షేమ అధికారిని హేమాభార్గవి
మెదక్ (ప్రజాజ్యోతి)మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సామాజిక సాధికారత సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారిణి హేమ భార్గవి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండల పరిషత్ కార్యాలయంలో టాస్కా జిల్లా అధ్యక్షుడు శివ కృష్ణమూర్తి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీల కంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. మహిళా అధికారులను, సభ్యులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి, టాస్కా రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
