తాజా పరిణామాలపై పాక్ మాజీ మంత్రి ట్వీట్

V. Sai Krishna Reddy
1 Min Read

పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాడికి తామే పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో, దాడి వెనుక ఉన్న ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని పాకిస్థాన్ జాతీయులైన అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయం పాక్‌లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం దాడి చేసినా లేదా బెదిరించినా దేశాన్ని రక్షించుకోవడానికి తామంతా కలిసి నిలబడతామని ఆయన అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ దేశం కోసం ఒక్కటిగా ఉంటామని పేర్కొన్నారు. మాతృభూమిని కాపాడుకోవడానికి పాకిస్థాన్ జెండా కింద ఐక్యంగా నిలుస్తామని తెలిపారు.

అలాగే, మోదీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు చౌదరి ఫవాద్ మరో పోస్ట్ పెట్టారు. భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించిందని, యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఆశిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *