స్కూల్ తాండ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం
— ఇద్దరికి తీవ్ర గాయాలు
రామారెడ్డి మార్చ్ 30 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం స్కూల్ తండా తుంపల్లి రోడ్డు అడవి ప్రాంతంలో లారీ బైకు ఢీకొన్న సంఘటనలో కేతవతూ భికాను (24) అనే వ్యక్తికి తీవ్ర గాయాలతో కుడికాలు విరిగింది.మాలోతు మహేష్ (19)కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సకాలంలో సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.108 అంబులెన్స్ సిబ్బంది ఈయంటి మేతుకు నరేష్, పైలట్ ముదం ప్రణిత్ కుమార్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలుతెలియజేశారు.
