ప్రాచీన దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Nalgonda Bureau
1 Min Read

ప్రాచీన దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్డిఓ వేణుమాధవ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి చివ్వెoల మండలం ఉండ్రుగొండ లోని శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ దేవాలయ అభివృద్ధి ప్రచార రధానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు చకిలం ఫణికుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా దేవాలయ అభివృద్ధికి తన సొంత నిధులతో ఎంతో కృషి చేశానన్నారు.ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో దేవాలయ అభివృద్ధి కోసం ప్రచార రథాన్ని పంపుతూ ప్రాచీన దేవాలయాల ప్రాముఖ్యతను తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు.అభివృద్ధికి దాతలు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ కొత్త ఆంజనేయులు, అర్చకులు దరురి రామానుజాచార్యులు, దరురి శ్రీధర్ ఆచార్యులు, భజన మందిరం చైర్మన్ రాచర్ల వెంకటేశ్వర్ రావు,కాకి మల్లారెడ్డి,లక్కరాజు రమేష్, చారి,బసవయ్య, చకిలం రమాదేవి, బానోతు కౌసల్య,గోలి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *