రైతు భరోసా సంబరాలు.. నిడమానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం

Nalgonda Bureau
1 Min Read

రైతు భరోసా సంబరాలు.. నిడమానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం

నిడమనూరు, జూన్ 24(ప్రజాజ్యోతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం ఆధ్వర్యంలో నిడమనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు జరుపుకున్నారు. జూన్ 16న మొదలుపెట్టి.. జూన్ 24న రైతులందరికీ అకౌంట్లో డబ్బులు జమ చేసినందుకు రైతు భరోసా సంబరాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం అంకతి సత్యం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోరూ‌ 9 వేల కోట్లలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రూ.1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణయ్య,పిసిసి డెలిగేట్ సభ్యులు ముంగి శివమారయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ శ్రీనివాస్ రెడ్డి , ఉన్నం సత్యనారాయణ , మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్ రెడ్డి, బొల్లం బాలయ్య ,పోలె రవి, చెరక శ్రీను, అయితేగోని మధు, మెరుగు శ్రీను, వూర రవి, జైపాల్ రెడ్డి , మోసాల శ్రీను, గుండెబోయిన శంకర్, శివ గొంగటి శ్రీను, రాజి రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సోదరులు ,తదితరులు, పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *