అటు నుంచి తూటా వస్తే, ఇటు నుంచి బాంబు వెళ్లాలి!: ఆర్మీకి స్పష్టం చేసిన మోదీ!

V. Sai Krishna Reddy
1 Min Read

ఇవాళ రక్షణ శాఖ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం
తూటాకు తూటానే సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ ఆదేశాలు!
పాక్ దాడి చేస్తే మన ప్రతిదాడి శక్తిమంతంగా ఉండాలని స్పష్టీకరణ
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వారి కాల్పులకు దీటైన జవాబు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ‘తూటాకు తూటానే సమాధానం’ అనే రీతిలో ప్రతిస్పందన ఉండాలని స్పష్టం చేసినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది.

ఏఎన్ఐ కథనం ప్రకారం… “అక్కడి నుంచి ఒక తూటా పేలితే, ఇక్కడి నుంచి బాంబు వెళ్లాలి. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడితే, భారత బలగాలు మిస్సైళ్లతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. వారు కాల్పులు ప్రారంభిస్తే, మనం రెట్టింపు స్థాయిలో కాల్పులు జరపాలి. వారు దాడి చేస్తే, మనం మరింత శక్తివంతంగా ప్రతిదాడి చేయాలి” అని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ ఆదేశాలతో భారత సాయుధ బలగాలు సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికైనా దీటుగా బదులిచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. పీఓకేపై భారత్ వైఖరి, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు వంటి పరిణామాలు పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *