తెలంగాణ లో నిరుద్యోగ యువకులకు చక్కటి ఉపాధి అవకాశాలు..
ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతి యువకులకు చక్కటి అవకాశం..
వరంగల్ బ్యూరో / ప్రజాజ్యోతి::
ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో 60% మార్కులు కలిగి ఉన్న వారు లేదా బిటెక్ /డిప్లొమా /ఐటీఐ సివిల్ డిపార్ట్మెంట్ లో పట్టా కలిగి ఉన్న అర్హులైన వారు సర్వేయర్ ట్రైనింగ్ కు మీసేవ లో దరఖాస్తు చేసుకోవచ్చని స్టేట్ సర్వే డిపార్ట్మెంట్ పేర్కొంది.
సర్వేయర్ ట్రైనింగ్ పొందాలనుకునే యువకులు మీసేవ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఇందుకు అప్లికేషన్ ఫీజు ₹ 100=00, సర్వీస్ చార్జెస్ ₹ 45=00 చెల్లిస్తూ.. ఓపెన్ కేటగిరి ₹10,000=00, బిసి కేటగిరి, ₹5000=00, ఎస్సి, ఎస్టీ ₹ 2500=00 లు చెల్లించి దరఖాస్తు చేసుకుని సర్వే ట్రైనింగ్ పొందవచ్చు..