ఆదివాసి ఎరుకల హక్కుల సాధనకు పోరాటం చేయాలి.. రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు  

Warangal Bureau
2 Min Read

ఆత్మకూరు, ఏప్రిల్ 14 (ప్రజాజ్యోతి):

ఆదివాసీ ఎరుకల హక్కుల సాధనకు పోరాటం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఆత్మకూరు మండల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హాజరై ముందుగా ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించి అనంతరం మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు మండల అధ్యక్షులు దుగ్యాల రమేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ.. మండలంలో ఆదివాసి ఎరుకల ప్రజలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రి మారిన ఆదివాసి ఎరుకల జీవితాలు మాత్రము మారడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 8 లక్షల జనాభా కలిగి ఉండి రాజ్యాంగ పరంగా రావలసిన హక్కులు మాకు రావడంలేదని, కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ఆదివాసి గిరిజన తెగలకు మాత్రమే విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతున్నారని వారికే ప్రభుత్వాలు పాలకులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మా సమస్యలకు పరిష్కారం గురించి మా సామాజిక వర్గం నుండి రాజకీయంగా ఎవరు లేనందున చాలా ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఎవరు మా పక్షాన నిలబడి మాట్లాడేవారు లేనందున మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఎరుకల జాతి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇంత వరకు రాష్ట్రంలో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్టిలో కూడా ఏ బి సి డి వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతిరి రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం, ములుగు జిల్లా నాయకులు పల్లకొండ ఎల్లా స్వామి, సాల బాబు హనుమకొండ జిల్లా నాయకులు బిజిలి ప్రశాంత్, వరంగల్ జిల్లా నాయకులు దుగ్యాల రామ్, జంగాలపల్లి రాజు, పులి చేరు సురేష్, నలగొండ మండల అధ్యక్షులు దుగ్యాల రమేష్, పులుచేరు సాంబరాజు, దుగ్యాల శ్రీను, పులి సేరు ప్రశాంత్, పులి చేరి విజయ్, దుగ్యాల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *