బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేడు జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు.
ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు, తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.