Rangareddy Bureau

24 Articles

గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి

గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి - గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి - సిపిఐ జిల్లా…

*గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి* – గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి – సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య – కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ధర్నా చేవెళ్ల, ఫిబ్రవరి 23 (ప్రజా జ్యోతి): చేవెళ్ల పట్టణంలోని సర్వే నెంబరు 75 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ ఇన్‌చార్జి రామస్వామి అధ్యక్షతన సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా పేదలు సీపీఐ జెండా పట్టుకుని గుడిసెలు వేసుకుని నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇంటి స్థలం సర్టిఫికెట్లు మంజూరు చేసి, కాలనీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. శంకర్‌పల్లి మండలంలో గతంలో 500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని ఆరోపిస్తూ, అక్కడి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు.మోకిలా పొన్నగుట్ట తండాలో గిరిజన రైతుల భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుని, వారికి కేటాయించాల్సిన 800 గజాల స్థలాలను ఇవ్వకుండా ఇతరుల పేర్లు ఎంజాయ్‌మెంట్ సర్వేలో చేర్చడం అన్యాయమని విమర్శించారు. అసలైన గిరిజన రైతుల పేర్లను జాబితాలో చేర్చి హక్కుల ప్రకారం స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది నిరుపేదలు ధర్నాలో పాల్గొని, పేదలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభు, వడ్ల సత్యనారాయణ బాతరాజు నరసింహ, మండల కార్యదర్శులు సత్తిరెడ్డి, కే శ్రీనివాస్ పి సుధీర్ జిల్లా సమితి సభ్యులు మంజుల సుధాకర్ గౌడ్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

- బిజెపి పార్టీ అభ్యర్థి అత్తెలి మనీషా అనంత్ రెడ్డి - 12 వ వార్డులో ఇంటింటికి బిజెపి…

February 3, 2026

  సేవకురాలిగా వస్తున్న ఆశీర్వదించి గెలిపించండి - బిజెపి అభ్యర్థి అత్తెలి మనీషా అనంత్ రెడ్డి చేవెళ్ల ఫిబ్రవరి…

దామరగిద్ద 9 వ వార్డ్ నుంచి బరిలో మాచన్ పల్లి యాదయ్య

చేవెళ్ల ప్రజా జ్యోతి చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద 9 వ వార్డు నుంచి మాచన్ పల్లి యాదయ్య…

అంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణం

అంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణం చేవెళ్ల మండల పరిధిలోని అంతరం పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ…

కౌకుంట్లలో ఓటు వేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. చేవెళ్ల…

December 14, 2025

9 గంటల వరకు 22.63% పోలింగ్ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల…

November 10, 2025

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

September 9, 2025

Breking news నార్సింగ్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ సోదాలు. 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్…

చేవెళ్ల రచ్చబండ లడ్డు 16 లక్షలు

చేవెళ్ల రచ్చబండ లడ్డు 16 లక్షలు లడ్డు వేలం పాటలో దక్కించుకున్న అత్తెలి బ్రదర్స్ చేవెళ్ల సెప్టెంబర్ 06(ప్రజా…

కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదల పాలిట వరం

*కల్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదల పాలిట వరం* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్ల ప్రజా జ్యోతి కల్యాణ…

కనెక్ట్ అయి ఉండండి

28°C
Hyderabad
broken clouds
28° _ 27°
68%
4 km/h
Sat
27 °C
Sun
31 °C
Mon
27 °C
Tue
29 °C
Wed
31 °C