రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
— మినుకుల రాకేష్ ఏఈఓ
కామారెడ్డి జూన్ 27 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి రైతు వేదికలో వానాకాలం రైతు భరోసా పథకం కోసం కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. పంట పెట్టుబడి సహాయం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులు దరఖాస్తు ఫారం తో పాటు పట్టా పాస్ బుక్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, బ్యాంకు ఖాతా వివరాలతో రైతు వేదికలో సంప్రదించి దరఖాస్తులను ఇవ్వాలి అని కోరడం జరిగింది.
