విశాఖలో ఫార్మా సంస్థ డైరెక్టర్ ఆత్మహత్య

V. Sai Krishna Reddy
1 Min Read

విశాఖపట్నం నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫార్మా సంస్థ వసుధ ఫార్మా డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం నాడు స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి మైదానంలో ఆయన మృతదేహాన్ని గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రగతి మైదానంలో ఒక వ్యక్తి మరణించి ఉన్నట్లు అందిన సమాచారంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వసుధ ఫార్మా డైరెక్టర్‌గా గుర్తించారు. ఆయన మృతదేహం పక్కనే ఒక పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగవరప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *