తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్లో ఏం జరుగుతోంది? అసలు పార్టీ అధినేత కేసీఆర్కు అన్నీ తెలిసే జరుగుతున్నాయా? తెలియకుండా పనులు కానిచ్చేస్తున్నారా? ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీలో జరు గుతున్న చర్చ. తాజాగా బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. కీలక ప్రకటన చేశారు. బీఆర్ ఎస్ అనుబంధ విభాగం.. తెలంగాణ జాగృతికి సంబంధించి ఆమె విదేశీ కమిటీలను ఏర్పాటు చేశారు. దీనిపై ఆమె కొన్ని పేర్లను కూడా ప్రకటించారు.
వాస్తవానికి బీఆర్ ఎస్లో ఏం జరిగినా.. ముఖ్యంగా ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయాలని అనుకుంటే.. ఖచ్చితంగా పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలి. ఆయన చెప్పినట్టు మార్పులు , చేర్పులు చేయాలి. అదేవిధంగా ఆయన సంతకంతోనే ప్రకటనలు, నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి హోదాలో కవిత తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అనుమానాలు.. సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. తెలంగాణ జాగృతి విదేశీ అధ్యక్షులు అంటూ.. 14 దేశాలకు ఆమె పేర్లను ప్రకటించారు.
అయితే.. వీరిలో అసలు బీఆర్ ఎస్తో సంబంధం లేని వారు కూడా ఉన్నారన్నది ఆ పార్టీ లో జరుగుతు న్న చర్చ. పైగా.. ఆమె విడుదల చేసిన ఈ ప్రకటనకు సంబంధించి కేసీఆర్ ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఆయన కనుసన్నల్లోనే వీటిని ఏర్పాటు చేశారా? అనేది ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటిపై మౌనం వహించిన కవిత.. తనంతట తానుగా ఈ నిర్ణయంతీసుకున్నారన్నది పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు జాగృతి పేరుతో విదేశాల్లో ఎలాంటి కమిటీలను కేసీఆర్ ఏర్పాటు చేయలేదు. అలాంటప్పుడు.. కవిత ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. పార్టీలో నెంబర్2 అనిపించుకునేందుకు కవిత ఇలా గేమ్ ప్లే చేస్తున్నారా? అని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు