భూ భారతి చట్టం శాశ్వత పరిష్కారం
ఆధార్ లా భూధార్
గ్రామ స్థాయి లో గ్రామ రికార్డులు నిర్వహణ
జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్
కోదాడ టౌన్, ఏప్రిల్ 21 (ప్రజా జ్యోతి): భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ ఎస్ వి పంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం 2025 పై అవగాహన సదస్సు కార్యక్రమంను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ముందుగా తెలంగాణ రాష్ట్ర జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం, చట్టం అమలుకు తక్కువ కాలంలోనే నియమాలు రూపొదించటం, చట్టం అమలు పర్చటానికి క్షేత్ర స్థాయి అధికారులు ఏర్పాటు, భూ సమస్యలను దరఖాస్తు చేసుకొనుటకు భూ భారతి పోర్టల్ సమస్య లను పరిష్కరించేందుకు అధికారుల అధికారాలు అనే నాలుగు మూల స్తంబాల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రియల్ 14 రోజున భూ భారతి చట్టం అమలులోనికి తీసుకొని రావటం జరిగిందని తదుపరి రాష్ట్ర స్థాయి లో, జిల్లా స్థాయి లో రెవిన్యూ సిబ్బందికి అవగాహన కల్పించటం జరిగిందని ఇప్పుడు మండల స్థాయి లో ప్రజలకి చట్టం పై అవగాహన తెచ్చేందుకు 23 మండలాలలో ప్రజలకి సమస్యలు ఎలా పరిష్కరించాలో,అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ధరణిలో చాలా సమస్యలు పరిష్కరించలేనివి ఉన్నాయని ప్రతి సమస్యని కలెక్టర్ ద్వారా గానీ కోర్టు ద్వారా గానీ పరిష్కరించే విధంగా ఉండేదని ప్రతి ఒక్కరు గ్రామం నుండి సూర్యాపేట వచ్చి సమస్య పై దరఖాస్తు ఇవ్వాలంటే ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉండేదని కానీ భూ భారతి చట్టం ద్వారా అధికారం వికేంద్రికరణ జరుగుతుందని సమస్యని బట్టి తహసీల్దార్, ఆర్ డి ఓ, కలెక్టర్ స్థాయి లో పరిష్కరించవచ్చు అని త్వరలో గ్రామ స్థాయి లో భూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ పరిపాలన అధికారి (జి పి ఓ) నియమించబోతున్నారని తెలిపారు.భూ భారతి చట్టం ఏప్రియల్ 14 న ప్రారంభించి నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుతుందని తదుపరి ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో అమలు చేస్తారని అక్కడ ఏమైనా సమస్యలు పరిస్కారం కాకపోతే భూ భారతి చట్టంలో మార్పులు తెచ్చి భూ సమస్యలు తీర్చుతారని తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం లో భూ భారతి చట్టం అమలు జరుగుతుందని తెలిపారు.భూమిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారని చాలా మందికి బ్రతకడానికి భూమినే ఆధారం ఆ భూమి తమదని నిరూపించు కునేందుకు పట్టాదారు పాస్ బుక్ ఉండాలని భూ భారతి చట్టం ద్వారా 13 (బి) లకు పాస్ బుక్ నందు అలాగే 2020 అక్టోబర్ లో 2014 జూన్ 2 కి ముందు సాదా కాగీతం, స్టాంప్ పేపర్ పై కొనుగోలు చేసి 12 సం. లు సాగు చేస్తున్నా వారు ధరఖాస్తు చేసుకున్న సాధాబైనామా ధరఖాస్తులు పరిశీలించి వాటిని పట్టాదార్ పాస్ బుక్ నందు అప్డేట్ చేస్తమని ఈ అవకాశం ధరణిలో లేదు అని తెలిపారు.గతంలో కుటుంబంలో కొంతమంది మాత్రమే భూమిని పట్టా మార్పిడి చేసుకునేవారని భూ భారతి చట్టం అమలులో భాగంగా వారసత్వం /పౌతి అమలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరికి కి,గ్రామ పంచాయతీలో నోటీసులు ఇచ్చి వారం గడువు ఇస్తామని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు అని అలాగే పౌతి అమలు అయినా తర్వాత కూడా మార్పులకి అప్పీల్ చేసుకోవచ్చు ఈ అవకాశం ధరణి లో లేదని తెలిపారు.గ్రామ రెవిన్యూ రికార్డులు నిర్వహణలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 న ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి ప్రతి రైతు కి 1 బి అందజేస్తామని ఏమైనా తప్పులు ఉంటే సరి చేస్తామని తెలిపారు.విస్తీర్ణం లో మార్పులు,మిస్సింగ్ సర్వే నెంబర్, సవరణలు లాంటి
ప్రతి సమస్యకి మీ సేవ ద్వారా కాకుండా స్వయంగా దరఖాస్తు చేసుకునేలా భూ భారతి పోర్టల్ రూపొదించారని తెలిపారు.ఆధార్ వల్లే ప్రతి ఒక్కరి భూమికి భూధార్ అనే యూనిక్యూ నెంబర్ ఇచ్చి ప్రతి భూమికి సరిహద్దులు నిర్ణయించి సర్వే మ్యాప్ ని భూ భారతి పోర్టల్ లో అప్డేట్ చేస్తామని తదుపరి ప్రజలు పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలి పారు.రాబోయే రోజులలో భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవిన్యూ అధికారులు కృషి చేస్తారని తెలిపారు.ఆర్ డి ఓ సూర్యనారాయణ సెక్షన్ ల వారీగా భూ భారతి చట్టం పై పిపిటి ద్వారా ప్రజలకి వివరించారు.జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ రైతు సంకెళ్లు విడిపించేలా భూ భారతి చట్టం ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని ఇక నుండి భూ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించుటం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్లు వాజీద్ అలీ, ఎంపిడిఓ రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల పార్టీ అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి, మందలపు శేషు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.