కంచె గచ్చిబౌలి భూములపై స్పందించిన ప్రధాని మోదీ

V. Sai Krishna Reddy
1 Min Read

గత నెలరోజులుగా తెలంగాణ రాజకీయాలను కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం కుదిపేస్తోంది. విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్‌ తీరును తప్పుబట్టారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. తక్షణమే వేలాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇవే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న పచ్చని అడవిని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం అటవీ సంపదను నాశనం చేస్తుందని మండిపడ్డారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు మోదీ. ఆ హామీలను గాలికొదిలేయడమే కాకుండా ప్రకృతిని ధ్వసం చేస్తూ స్వచ్ఛమైన గాలి లేకుండా చేస్తుందని విమర్శించారు ప్రధాని. మోదీ వ్యాఖ్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాము అడవిని ధ్వంసం చేయడంలేదన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *