నెక్కొండ, ప్రజాజ్యోతి:
ఆకతాయిల చిల్లర పనికి చెరువు కట్ట ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. వరంగల్ జిల్లా నెక్కొండ పనికర ఊర చెరువు లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించటంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఎండు గడ్డి, చెట్లు అగ్నికి ఆహతి అయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కావాలని ఎవరైనా చేశారా.. లేక ప్రమాద వశాత్తు జరిగిందా.. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.చెరువు పై భాగంలో ఉన్న గడ్డికి (దర్భ, తుంగ) కు నిప్పు పెట్టడంతో చెరువు కట్ట ప్రాంతం మొత్తం తగలబడుతొంది. చెరువులో ఉన్న తుమ్మ చెట్లు సైతం అగ్నికి ఆహుతయే ప్రమాదం పొంచి ఉంది.. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని మంటలు ఆర్పాలని స్థానికులు కోరుతున్నారు..