తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను అడుక్కోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. “వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉంది కదా” అని ఆయన అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేయబోతోందని కూడా ఆయన తెలిపారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రతిసారి దర్శనాల కోసం ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకు? భద్రాచలంలో రాములవారు, యాదగిరిలో లక్ష్మీనరసింహా స్వామి, రామప్పలో శివాలయాలు లేవా?” అని ప్రశ్నించారు. తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న తమ రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని ఆయన సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తిరుమల దేవస్థానం దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రతీసారి అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ లేదా? ఎందుకు ప్రతీసారి బతిమాలుకోవడం? భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివుడి ఆలయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా?” అని ప్రశ్నించారు. టీటీడీ వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఈ ఆలయాలకు వెళ్లొచ్చని ఆయన సూచించారు