నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఎండల తీవ్రతకు అడవుల్లో ఆహారం కరువవ్వడంతో వానరాలు ఆకలి తీర్చుకోవడానికి గడ్డిని ఆశ్రయిస్తున్నాయి. మంగళవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ మార్గంలో నిలిపి ఉంచిన ఎండుగడ్డి ట్రాక్టర్పై వానరాల గుంపు పడింది. గడ్డిని పీకుతూ అందులోని ధాన్యపు గింజలను తింటూ ఆకలి తీర్చుకున్నాయి. అడవిని వదిలి ఊళ్లబాట పట్టిన కోతులు ఇలా గడ్డి తినడం చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల కోసం అడవుల్లోనే ఆహార సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
