కత్తితో పొడిచిన దారుణ హత్య..మద్యం మత్తులో క్షణికావేశంలో కత్తి దాడి..

Warangal Bureau
1 Min Read

కొడకండ్ల రూరల్, ఏప్రిల్ 21 (ప్రజా జ్యోతి):

– అక్కడికక్కడే ప్రాణాలు వదిన గుగులోతు శ్రీను

– నిందితుడు జేత్రం కి అదుపులో తీసుకున్న పోలీసులు

పాత కక్షలే ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో జేత్రం అనే వ్యక్తి గుగులోతూ శ్రీను ను కత్తితో పొడిచి హతమార్చిన ఘటన సోమవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రేగూల తండాలో కలకలం రేపింది. ఇంటి ముందు ఖాళీ స్థలం విషయంలో గొడవలు జరుగుతుండగా అదే తండాకు చెందిన జేత్రం మద్యం మత్తులో క్షణికావేశంలో కత్తి తో పొడవగా అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు శ్రీను.ఈ హత్యతో రెగులా తండా ఒక్కసారిగా ఉలిక్కి పడి గ్రామస్తులు భయబ్రాంతులకు గురపుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై చింత రాజు ఘటన స్థలానికి చేరుకొని జేత్రం ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *