చేర్యాలలో మొదలైన నామినేషన్ల పర్వం
– తొలి రోజు అయిదు నామినేషన్లు దాఖలు
చేర్యాల, జనవరి 28 (ప్రజాజ్యోతి):
చేర్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం)లో బుధవారం ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల స్థానాలు ఉండగా, తొలి రోజు మొత్తం అయిదు నామినేషన్లు దాఖలయ్యాయి. 1 వార్డు నుండి అవుశెర్ల నాగమణి,2 వార్డు నుండి కమలాపురం గీతాంజలి,4 వార్డు నుండి నిమ్మ సుప్రజ ,10 వ వార్డు నుండి మేడిశెట్టి ఉమ,12 వ వార్డు నుండి శివగారి భవిత నామినేషన్ దాఖలయ్యాయాని మున్సిపల్ నాగేందర్ తెలిపారు.
