- బస్సు లారీ డీ ఇద్దరు మృతి…
బస్సు లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీనీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు లోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతులు పులమాటి ఓం ప్రకాష్ దిండిగల్ గ్రామం, నవదీప్ సింగ్ (s/o ముంజిత్ సింగ్) హనుమకొండ బాలసముద్రం గా గుర్తించారు. గాయాలైన వారిని జనగామ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.
