- రాష్ట్రస్థాయి తాంగ్ తా పోటీలకు ఎంపికైన డిస్నీల్యాండ్ స్కూల్ విద్యార్థులు
దామెర / ప్రజాజ్యోతి::
ఇటీవల మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో నిర్వహించిన జిల్లా స్థాయి తాంగ్ తా పోటీల్లో డిస్నీల్యాండ్ విద్యార్థులు ఐదుగురు ఉత్తమ ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ కావడం ఎంతో గర్వకారణమని స్కూల్ యాజమాన్యం దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, శోభారాణి, రాకేష్ భాను, దినేష్ చందర్లు తెలియజేశారు. వీరిలో అండర్-17 విభాగం లో కోరె ప్రమోద్ సాయి-10వ, కడారి కార్తికేయ-10వ, దద్దు అభిరామ్-8వ తరగతి, అండర్-14 విభాగం లో ఎల్. విష్ణు-8వ, కసగాని జై గౌడ్-7వ తరగతి విద్యార్థులు ఉన్నారు. అలాగే విద్యార్థుల కోచ్ వెంకటేష్ ను మరియు విద్యార్థులను యాజమాన్యం, ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అభినందించారు.

