తూనికల కొలతల పేరుతో అధిక వసూళ్లు  – బెంబేలెత్తుతున్న కూరగాయల వ్యాపారులు – ఎంతైనా వసూలు చేస్తాం అంటూన్న లైసెన్స్ హోల్డర్స్ శ్రీనివాస్ రెడ్డి, వాజిద్

Mahbubnagar Staff Reporter
3 Min Read

తూనికల కొలతల పేరుతో అధిక వసూళ్లు

– బెంబేలెత్తుతున్న కూరగాయల వ్యాపారులు

– ఎంతైనా వసూలు చేస్తాం అంటూన్న లైసెన్స్ హోల్డర్స్ శ్రీనివాస్ రెడ్డి, వాజిద్

మహబూబ్ నగర్ జూన్ 17 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా తూనికల కొలతల శాఖలో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు షాపులను పంచేసుకుంటున్నారు. ప్రైవేటు సిబ్బందితో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లీగల్‌ మెట్రాలజీ అధికారులు అందిన కాడికి వసూలు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల పెరుతో చిరు వ్యాపారులపై పడి దోచుకు తింటున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారుల వద్ద నుంచి తైబజార్ వసూలు చేయడం రద్దు చేశారు. దీంతో నిత్యం ఎండనక వాననక రోడ్డు పక్కన కూర్చుని దుమ్ము ధూళి లో వ్యాపారం చేసే చిరు వ్యాపారుల కు ఊరట లభించింది. ఆ ఊరట ఎన్నో రోజులు నిలువలేదు.

 

– *అధిక వసూళ్లతో బెంబేలెత్తుతున్న చిరు వ్యాపారులు*

 

యెన్నం శ్రీనివాసరెడ్డి తై బజార్ వసూళ్లు రద్దు చేయటంతో చిరు వ్యాపారులు ఎమ్మెల్యే ను దైవంగా భావిస్తుంటే లీగల్ మెట్రాలజి అధికారులు దయ్యాల్లా దాపురించి తమ వద్ద అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు అని కూరగాయలు అమ్మే వ్యాపారులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ పొందిన లీగల్ మెటాలజీ వ్యాపారస్తులు శ్రీనివాస్ రెడ్డి, వాజిద్, బాసిద్, నవీద్, శ్రీను లు సిండికేట్ గా మారి తాము చెప్పిందే వేధంగా అధికారులను తమ కనుసనల్లో పెట్టుకుని ఆడిందే ఆటగా ఇష్టారాజ్యంగా అధిక వసూల్లు చేస్తూ కింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు నెల నెల మామూళ్లు ముట్ట చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారు. మంగళ వారం స్థానిక కూరగాయల మార్కెట్లో తనిఖీల పేరుతో వసూళ్లకు తెర లేపారు. తూనికలు కొలతలు శాఖ అధికారుల పేరుతో మంగళవారం జిల్లా కేంద్రం లోని కూరగాయల మార్కెట్లో తక్కెడబాట్ల తనిఖీలు నిర్వహించారు. ఇందుకుగాను అధికారి సమక్షంలో నిర్వహించాల్సి ఉండగా ఏజెంట్లు అంతా తామే అంటూ కూరగాయలు అమ్మే రైతుల వద్ద నుంచి బలవంతంగా తక్కెడ బాట్లు గుంజుకు వచ్చి బాట్లకు సీలు వేసి ఒక్కొక్క వ్యాపారి వద్ద నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్కో వ్యాపారి దగ్గర రెండు మూడు బాట్లు ఉండగా ఒక్కోబాటుకు 300 చొప్పున అధికంగా వసూలు చేస్తూ న్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ మీద కేసులు అవుతాయని వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తుండడం విశేషం. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు డిపార్ట్మెంట్ హెడ్ రవీందర్ ను సంప్రదించగా తాను వేరే ప్రదేశంలో ఉన్నట్లు తన అధ్వర్యంలో నే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు బుకాయించడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నిస్తే నేను డబ్బులు వసూలు చేయడం లేదు వాళ్లు ఏజెంట్లు తక్కెడ లో ఉండే లోటుపాట్లను సవరించినందుకు గాను వారు సర్వీస్ చార్జీల పేరుపైన వసూలు చేస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి అనే లీగల్ మెట్రాలజి డిపార్ట్మెంట్ లైసెన్స్ హోల్డర్ మేము సర్వీస్ చేసినందుకు 100 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయినా మేము ఛార్జ్ చేస్తామని ఎంత వరకు వసూలు చేసిన అది మా ఇష్టం ఇందులో ప్రతి ఒక్క అధికారికి వాటాలు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పటం చూస్తుంటే అధికారులకు ఎంత స్థాయిలో నెల నెలా మామూలు మూడుతూన్నాయి అనే విషయం తేటతెల్లమవుతుంది. లీగల్ మెటాలజీ శాఖపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తనిఖీల పేరుతో చేస్తున్న అధిక వసూళ్ల ను అరికట్టాలని కూరగాయల రైతులు ప్రాధేయపడుతున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *