పెరుగుతున్న కరోనా కేసులు… తొమ్మిది నెలల శిశువుకు పాజిటివ్

V. Sai Krishna Reddy
1 Min Read

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి నెమ్మదిగా పంజా విసురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ వంటి పొరుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగుచూడటంతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో తొమ్మిది నెలల పసికందుకు కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హొస్కోటే ప్రాంతానికి చెందిన ఈ చిన్నారిని అనారోగ్యంతో మొదట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో మే 22న చిన్నారికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కర్ణాటక కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హర్ష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రమైన కేరళలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మే నెలలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 182 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ హెచ్చరించారు. జిల్లాల వారీగా చూస్తే, కొట్టాయం జిల్లాలో అత్యధికంగా 57 కేసులు నమోదు కాగా, ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు బయటపడ్డాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *