ఛార్ ధామ్ యాత్రకు బ్రేక్

V. Sai Krishna Reddy
1 Min Read

భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల క్షేమం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ దాడులు చేసే అవకాశం ఉండడంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపింది. యాత్ర ఎప్పటి వరకు రద్దు, తిరిగి ఎప్పుడు ప్రారంభించే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.

ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైన విషయం తెలిసిందే. యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకోగా కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న, బద్రీనాథ్ ధామ్ తలుపులు మే 4న తెరుచుకున్నాయి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులను యాత్రకు అనుమతిస్తారు. హిందువులకు అత్యంత ముఖ్యమైన ఈ యాత్ర హిమాలయాల్లోని యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్ నాథ్ మీదుగా వెళ్లి బద్రీనాథ్ తో ముగుస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *