సమస్యలు పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కు వినతి

Nalgonda Bureau
1 Min Read

సమస్యలు పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కు వినతి

మిర్యాలగూడ, ఏప్రిల్ 21,( ప్రజాజ్యోతి ): నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వల్లంపట్ల వెంకన్న మాట్లాడుతూ రాజీవ్ జీవ వికాస పథకంలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సబ్ ప్లాన్ నిధులను సద్వినియోగం చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. 2018 – 22 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఇండస్ట్రీస్ కి సబ్సిడీ నితక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. దళితులపై దాడి చేసిన వారిపై జాప్యం చేయకుండా, వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిగులు భూములను దళితులకు పంచాలని, దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. గ్రామాలలో కబ్జాలకు గురవుతున్న చెరువులను కాపాడాలని సబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. యాద్గార్ పల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్ అందుగుల సైదులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దీరావత్ లింగా నాయక్, వ్యవసాయ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా యాదగిరి, నెహ్రూ, సుధాకర్ లు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *