జాతీయ మౌంటైనింగ్ క్యాంపుకు ఎల్ బి కళాశాల విద్యార్థులు..
వరంగల్, ఏప్రిల్ 04 (ప్రజాజ్యోతి):
జాతీయ మౌంటైనింగ్ క్యాంపుకు ఎల్ బి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక లాల్ బహుదూర్ కళాశాల ఎన్సిసి ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూపు నుండి ఐదుగురు ఎన్సిసి కేడెట్ జాతీయ మౌంటైనింగ్ క్యాంపుకు వెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం కూల్ మనాలి మౌంటైనింగ్ కు ఐదుగురు తమ కళాశాల నుండి పాల్గొంటున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. కోట భాగ్యలక్ష్మి జూనియర్ అండ్ ఆఫీసర్, శివాని ఆర్ ఎ,బి సాయి గణేష్ రఘు , యండి.సోహెల్ , బి కౌశిక్ ఐదుగురు వెళ్ళినట్లు వీరు ఏడో తేదీ నుండి 20 ఏప్రిల్ తిరిగి వరంగల్ కు వస్తారని మీరు ఎల్లుండి ఉదయం కూల్ మనాలి లో పాల్గొంటారని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌంటైనింగ్ మంచు కొండలతో ఉండే అందాల పర్వతహరోనకు తమ కళాశాల నుండి పాల్గొంటున్న వారిని అభినందించారు. రాష్ట్రానికి, జిల్లాకు, కళాశాలకు మంచి ప్రతిభతో మొదటి స్థానం సంపాదించి పేరు తేవాలని వారిని అభినందించారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ భాగ్య నారాయణ, సెక్రెటరీ ఎన్ .వినయ్ కుమార్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ,ఎగ్జిబిషన్ సొసైటీ హైదరాబాద్ వారు విద్యార్థులను అభినందించారు మరియు ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం కాడెట్స్ పాల్గొన్నారు.