చదువుతో ఉన్నత స్థితి సాధ్యం- డాక్టర్ వల్లూరి మురళీకృష్ణ, చిట్టిప్రోలు యాదగిరి

V. Sai Krishna Reddy
1 Min Read

చదువుతో ఉన్నత స్థితి సాధ్యం- డాక్టర్ వల్లూరి మురళీకృష్ణ, చిట్టిప్రోలు యాదగిరి

నిడమనూరు,మార్చి 30(ప్రజాజ్యోతి):చదువుతో మాత్రమే ఉన్నత స్థితి,కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని హెడ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ వల్లూరి మురళీకృష్ణ, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చిట్టిప్రోలు యాదగిరి అన్నారు. ఆదివారం నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో డాక్టర్ మురళీకృష్ణ సౌజన్యంతో ఏర్పాటుచేసిన రూ.25వేల విలువగల జిమ్ పరికరాలు, జారుడు బండ లను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థితికి వచ్చామని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి విద్యార్థుల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నానని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బంకాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఫౌండేషన్ కు చిట్టిప్రోలు యాదగిరి రూ.లక్ష సహాయాన్ని అందించారు.అదేవిధంగా డాక్టర్ మురళీకృష్ణ గ్రామానికి ఫ్రీజర్ ఇస్తానని హామీ ఇచ్చారు. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ ను అభినందించారు. అనంతరం షటిల్ ,వాలీబాల్ కోర్టులను ప్రారంభించి ఆటలు ఆడి ఉత్సాహపరిచారు .జిమ్ము పరికరాలను వాడి యువకులను ఆనందపరిచారు. చిన్నారులు జారుడు బండకు విశేషంగా ఆకర్షితులవుతున్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ పేలపూడి బాలకృష్ణ, గ్రామ పెద్దలు ఉన్నం చిన్న వెంకటేశ్వర్లు, రాయపాటి పేరయ్య, పాంపాటి యాదగిరి, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కుక్కడపు రమేష్, గుండం రాజు వెంకటేశ్వరరావు,హెచ్ఎం రామారావు, , సుధేశ్వర రావు,గుండా లింగయ్య ,బండారు రామయ్య, బొంగరాల శ్రీనివాస్, సత్యనారాయణ, నరేష్, శ్రీనివాసరావు, రాంబాబు,కుమార్ ,తదితరులు ,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *