గో ఆదారిత వ్యవసాయంపై అవగాహన సదస్సు.. ఉగాది పురస్కారాలు..

Warangal Bureau
1 Min Read

దామెర/ప్రజాజ్యోతి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గో ఆధారిత వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జేబీడీ సొసై టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సరికొండ తిరుపతిరావు తెలిపారు. సరికొండ తిరుపతిరావు మాట్లాడుతూ..  ఉదయం 9 గంటలకు హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో గోఆధా రిత వ్యవసాయంపై అవగాహన సదస్సు ప్రారంభమవుతుందని తెలి పారు . ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో వినూత్న రీతిలో పంట ఉత్పత్తులను సాగుచేస్తున్న పలువురు ఆదర్శ రైతులకు ఉగాది పురస్కా రాలను అందచేయనున్నట్లు చెప్పారు . ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త లోపెల్లి జలపతిరావు , గౌరవ అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు . కాగా , రైతులకు అవసరమైన సేంద్రియ , సహజ , గో అధారిత , స్వదేశీ , గ్రామీణ , చేతి వృత్తుల తయారీదారులు ఎవరైనా ఉచి తంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు . ఉమ్మడి వరంగల్ , ఖమ్మం , కరీంనగర్ , నల్గొండ జిల్లాల్లోని ఆసక్తి కలిగిన రైతులు పెద్ద సం ఖ్యలో పాల్గొని , అవగాహన సదస్సును విజయవంతం చేయాలని తిరుపతిరావు కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *