తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల మే నెల లక్కీడిప్ కోటాను టీటీడీ మంగళవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్ టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవి.ఇన్ ద్వారా విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 18 నుంచి 20వ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లిస్తేనే టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.
వర్చువల్ సేవా టికెట్లు
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు కోటాను ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
అర్జిత సేవా టోకెన్లు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టోకెన్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
అంగ ప్రదక్షిణం టోకెన్లు
అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించి మే నెల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
శ్రీవాణి ట్రస్టు టికెట్లు
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.