హైదరాబాద్ నగరంలో పెరగనున్న బస్సు ఛార్జీలు… ఎందుకంటే?

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలను సవరించనుంది. భాగ్యనగరం పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్డినరీ బస్సుల్లో మొదటి స్టాప్ నుంచి మూడు స్టాపుల వరకు ఛార్జీని రూ. 5, నాలుగు స్టాపుల తర్వాత ఛార్జీని రూ. 10 వరకు పెంచనున్నారు.

మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టాప్ వరకు రూ. 5, రెండో స్టాప్ నుంచి రూ.10 వరకు ఛార్జీలను పెంచాలని సంస్థ నిర్ణయించింది. పెరిగిన ధరలు అక్టోబర్ 6వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం విదితమే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *