సురవరం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

V. Sai Krishna Reddy
1 Min Read

కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే పని చేసే సుధాకర్ రెడ్డి ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.

కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ కార్యదర్శి స్థాయికి చేరారని కొనియాడారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీపడకుండా పనిచేశారని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *