విద్యుత్ షాక్ తో విజయవాడలో ముగ్గురి మృతి

V. Sai Krishna Reddy
0 Min Read

విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ భవనంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురిలో ఒకరిపేరు ముత్యాలమ్మగా గుర్తించామని, మిగతా ఇద్దరి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *