అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో ట్రంప్ టవర్లను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉందనే చర్చ ఇటీవల బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… రాబోయే నాలుగైదేళ్లలో భారత్ లో పలు కీలక నగరాల్లో 10కి పైగా ప్రాజెక్టులు రానున్నాయని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి
ఇందులో భాగంగా… హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఇరా రియాల్టీ సహకారంతో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రతిపాదిత ట్రంప్ టవర్స్ నగరంలోనే అత్యంత ఎత్తైనదిగా ఉంటుందని చెబుతున్నారు. అవి సుమారు 50 అంతస్తులకు పైగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. వీటికి రెండు మూడు వారాల్లో అన్ని రకాల అనుమతులు వస్తాయని చెబుతున్నారు
ఇందులో భాగంగా… హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఇరా రియాల్టీ సహకారంతో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రతిపాదిత ట్రంప్ టవర్స్ నగరంలోనే అత్యంత ఎత్తైనదిగా ఉంటుందని చెబుతున్నారు. అవి సుమారు 50 అంతస్తులకు పైగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. వీటికి రెండు మూడు వారాల్లో అన్ని రకాల అనుమతులు వస్తాయని చెబుతున్నారు. Also Read – పెళ్లింట విషాదం.. రొట్టెల కోసం గొడవ.. ఇద్దరు యువకుల దారుణ హత్య! వాస్తవానికి ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆయా నగరాల్లో ట్రంప్ టవర్లు ఐకానిక్ భవనాలుగా పిలవబడతాయి. ప్రాపర్టీ లొకేషన్ తో పాటు, లే అవుట్ లు, ప్రత్యేకమైన మెరుపులు వెరసి ట్రంప్ టవర్లు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయని చెబుతారు. ఈ సమయంలో ట్రంప్ టవర్స్ తో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోకి అంబానీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అవును… హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ లో అద్భుత ఘట్టాలు జరగబోతున్నాయని! ఇందులో భాగంగా.. కోకాపేటలో త్వరలో ట్రంప్ టవర్స్ నిర్మాణం మొదలుకాబోతుందని అంటున్న వేళ.. అంబానీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. గుర్గావ్ లో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ తర్వాత హైదరాబాద్ లో పని మొదలుపెట్ట బోతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
రిలయన్స్ ఆధ్వర్యంలో గుర్గావ్ లో మెట్ సిటీని నిర్మిస్తున్నారు. మోడల్ ఎకనమిక్ టౌన్ షిప్ పేరుతో ఈ నిర్మాణం.. రిలయన్స్ ఎస్.వో.యూ. లిమిటెడ్ అనే కంపెనీతో రూపుదిద్దుకుంటుంది! ఈ కంపెనీయే ఇప్పుడు హైదరాబాద్ లో స్థలాల కోసం వాకబు చేస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఓ పక్క ట్రంప్ టవర్స్, మరో పక్క అంబానీ టవర్స్ తో త్వరలో హైదరాబాద్ కు మరింత కొత్త లుక్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.