కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేయడానికి గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
ఈ సమస్య నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కీలక సూచన చేసింది. తిరుమలలో గదుల కోసం ఎలా ప్రయత్నించాలి అనే విషయాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.
తిరుమలకు వచ్చిన భక్తులు గదుల కోసం తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీసు (సీఆర్ఓ)కు నేరుగా వెళ్లండి. అక్కడ మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ నెంబర్కు గది కేటాయింపు వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ముందుగా సీఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయించబడతాయి. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.
తిరుమలలో గదుల కోసం ఇబ్బందులు పడకుండా నేరుగా సీఆర్ఓ కార్యాలయానికి వెళ్లి, రూమ్లను సులభంగా పొందే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు