అనిల్ కుంబ్లేతో డీకే శివకుమార్ మంతనాలు.. రాజకీయాల్లో చేరుతున్నాడా?

V. Sai Krishna Reddy
0 Min Read

టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్న శివకుమార్ దేశానికి, రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను కొనియాడారు.

దీనికి కుంబ్లే కూడా స్పందించాడు. తనను కలిసేందుకు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, ఈ సమావేశం వెనుకున్న కారణాలు తెలియరాలేదు. మరోవైపు, ఇద్దరి కలయికపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కుంబ్లేను డీకే రాజకీయాల్లోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే, కుంబ్లే మాత్రం ఇది వ్యక్తిగత సమావేశమని కొట్టి పడేశాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *