ముఖ్యమంత్రి కేటీఆర్’ అంటూ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు నోరు జారారు. ఆ తర్వాత ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అంటూ సరిదిద్దుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి పేరును మరిచిపోయారని, ఈ పొరపాటుకు గాను ఆయనను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు. నేను చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకోండంటూ ట్వీట్ చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “నెలకు రూ.6,500 కోట్లను ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు” అంటూ తడబడి, ఆ తర్వాత సర్దుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ, జూపల్లిని మంత్రివర్గం నుండి తొలగిస్తారేమోనని చురక అంటించారు