అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా

V. Sai Krishna Reddy
1 Min Read

వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

మలేషియా వేదికగా జరిగిన U19WorldCup ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష గారు ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు.

గొంగడి త్రిష గారి లాంటి క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు…..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *